Thursday, February 23, 2012

ఉత్కంఠ భరితం కోవూరు ' ముక్కోణం ' !

నెల్లూరు,ఫిబ్రవరి 23:  ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలలో నెల్లూరు జిల్లా కోవూరు స్థానం ఎన్నిక ఆసక్తి రేపుతోంది.  ఆరు తెలంగాణ స్థానాల్లో పోటీకి దూరం గా ఉన్న  వైయస్ జగన్‌ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క కోవూరు నుంచి బరిలోకి దిగుతోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,  కాంగ్రెసు తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. కాంగ్రెసు తరఫున ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు కోవూరులో మోహరించనున్నారు.  నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగానే ఉంది. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు శాసనసభ్యుడు, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం కోసం రంగంలోకి దిగనున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన గెలుపు పై  పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
కాగా ఈనెల 25న ప్రసన్నకుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఆయన తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మార్చి 2 నుంచి  ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మార్చి 2న విడవలూరు, 3న కొడవలూరు, 4న ఇందుకూరుపేట మండలాల్లో ఆయన తొలి విడత ప్రచారం నిర్వహించనున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...