హైదరాబాద్ , ఫిబ్రవరి 19: ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించింది. జూపల్లి కృష్ణారావు(కొల్హాపూర్) జోగు రామన్న(ఆదిలాబాద్), టి.రాజయ్య (స్టేషన్ ఘన్ పూర్), సయిద్ ఇబ్రహీం (మహబూబ్ నగర్), గంప గోవర్థన్ (కామారెడ్డి) పేర్లను ఖరారు చేసింది. వీరిలో ఇబ్రహీం మినహా మిగతావారందరూ తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినవారు కావడం గమనార్హం. కాగా నాగర్ కర్నూలులో నాగం జనార్దనరెడ్డిపై పోటీ పెట్టరాదని టీఆర్ఎస్ నిర్ణయించింది.
కోవూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కోవూరు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నెల 25వ తేదీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు.
కోవూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కోవూరు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నెల 25వ తేదీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు.
No comments:
Post a Comment