లంక చేతిలో టీమిండియా ఓటమి...

బ్రిస్బేన్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారమిక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 51 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. లంక నిర్దేశించిన 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటయింది. టీమిండియా అన్ని రంగాల్లో విఫలపై ఓటమి చవిచూసింది. కొహ్లి(66), రైనా(32), పఠాన్(47) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో ఫెరీరా 4, కులశేఖర 3, మలింగ 2 వికెట్లు పడగొట్టారు. మహరూఫ్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, పఠాన్ రెండేసి వికెట్లు తీశారు. రైనా, యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు