న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లో సంక్షోభం ముదురుతోంది. నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోవడంతో ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా మూడు రోజులుగా కింగ్ఫిషర్ భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తోంది. ఏ విమానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారో చివరి నిమిషం దాకా తెలియకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు .దేశవ్యాప్తంగా కింగ్ ఫిషర్ కు చెందిన 40 విమానాలను రద్దు చేశారు. ఇందులో ముంబాయి నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు కూడా ఉన్నాయి. విమాన సర్వీసులు రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కింగ్ఫిషర్ సీఈఓ సంజయ్ అగర్వాల్ సహా ఇతర ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు కింగ్ఫిషర్ను బెయిలవుట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ విలేకరులతో చెప్పారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయాలను డీజీసీఏ చూసుకుంటుందని ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment