Saturday, February 11, 2012

అసమదీయులకు కిరణ్ తాయిలాలు...

హైదరాబాద్:,ఫిబ్రవరి 11:  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన 21 మంది శానససభ్యులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నజరానాలు ప్రకటించారు. నియోజకవర్గాల సంక్షేమం, అభివృద్ధి కింద వారికి నిధులు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.  పార్టీలోని అసంతృప్తులను తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ చర్యకు దిగినట్లు చెబుతున్నారు. 21 మంది శాసనసభ్యులకు మొత్తం 30కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.ఒక్కో ఎమ్మెల్యేలకు 2 కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు కేటాయించారు. నిధులు పొందిన శానససభ్యులు - కుంజా సత్యవతి ( రూ. 2 కోట్లు), శ్రీధర్ (2.51 కోట్లు), కవిత (2 కోట్లు), కమలమ్మ (2.7 కోట్లు), ఉషారాణి (3 కోట్లు), టివై దాసు (2 కోట్లు), ప్రవీణ్ రెడ్డి (2 కోట్లు), విజయ్ (2 కోట్లు), ప్రతాప రెడ్డి (3 కోట్లు), సుధాకర్ (2 కోట్లు), కన్నబాబు (2 కోట్లు), వరప్రసాద్ (1.05 కోట్లు), ఈలి నాని (2 కోట్లు), కాటసాని రాంరెడ్డి (2 కోట్లు), రాంభూపాల్ రెడ్డి (2.5), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (2.05), బాలు నాయక్ (2 కోట్లు), లింగయ్య (2.12 కోట్లు).రానున్న ఉప ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా శాసనసభ్యులకు ఆ నిధులు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. వీరికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశాలు  లేకపోవడంతో ముఖ్యమంత్రి ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను పూర్తి చేసి, చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా నియమిస్తారని తెలుస్తోంది. శానససభలో ప్రజారాజ్యం పార్టీ ఇంకా సాంకేతికంగా కాంగ్రెసు పార్టీలో విలీనం కాలేదు. విలీన ప్రక్రియ పూర్తయితే చిరంజీవి శానససభలో వెనక సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల గత శానససభా సమావేశాల సందర్భంగా విలీనానికి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదం తెలుపలేదని అంటున్నారు.తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికి శాసనసభలో వెనక సీట్లు కేటాయిస్తారు. చిరంజీవి శానససభకు తొలిసారి ఎన్నిక కావడం వల్ల విలీన ప్రక్రియ పూర్తయితే వెనక సీట్లోకి వెళ్లాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికే కాకుండా చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి ఆయనను శాసనసభా పక్ష ఉప నేతగా ప్రకటించనున్నారని సమాచారం. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...