మా వైపే ప్రజల చూపు: బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 : 'కాంగ్రెస్లో కుమ్ములాటలు, అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు తమ పార్టీ వైపే చూస్తున్నారని , వచ్చే ఎన్నికలు తమకు ఏకపక్షంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మద్యం ముడుపుల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ డొల్లతనం అసెంబ్లీలో బయటపడిందని, అటు చర్యలూ తీసుకోలేక...ఇటు అసెంబ్లీలో చర్చకూ ముందుకు రాలేక మొహం దాచుకొంటోందని ఆయన విమర్శించారు.
Comments