అడిలైడ్, ఫిబ్రవరి 12,: కామన్వెల్త్ బ్యాంక్ ముక్కోణపు సిరీస్లో భాగంగా ఓవల్ మైదానంలో జరిగిన నాల్గవ వన్ డేఅ లో ఆస్ట్రేలియా పై భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండడంతో కెప్టెన్ ధోని కొట్టిన సిక్సర్ తో విజయం భారత్ ను వరించింది. ధోని 44, అశ్విన్ 1 పరుగుతో నాటౌట్గా నిలిచారు. 270 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్లు రాణించడంతో తొలి వికెట్కు 52 పరుగులు లభించాయి. ఆతర్వాత ఆస్ట్రేలియా బౌలర్ మెక్ కే విజృంభించి సెహ్వాగ్ (20), కోహ్లి (18) వికెట్లు పడగొట్టాడు. అయితే గంభీర్ (92), శర్మ (33), రైనా (38) లు సమోచితంగా రాణించడంతో భారత్ లక్ష్యానికి చేరువైంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన గంభీర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకొని.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో హస్సీ 72, ఫారెస్ట్ 66, క్లార్క్ 38, క్రిస్టియన్ 39 పరుగులు చేశారు. భారత బౌలర్లలో యాదవ్, వినయ్కుమార్ రెండేసి వికెట్లు తీసుకోగా, జహీర్కు ఓ వికెట్ దక్కింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment