న్యూఢిల్లీ,ఫిబ్రవరి 2: 2జీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, టెలికం మాజీ మంత్రి ఎ.రాజా గురువారంతో ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన గతేడాది ఫిబ్రవరి 2న అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనదే తొలి అరెస్టు. అదే రోజున టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ప్రస్తుతం వీరిద్దరే జైల్లో ఉన్నారు. రాజా తనను బెయిలుపై విడుదల చేయాలని పిటిషన్ దాఖలు చేయలేదు. సిద్ధార్థ బెయిలు పిటిషన్లను విచారణ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తోసిపుచ్చాయి. సహ నిందితులు డీఎంకే ఎంపీ కనిమొళి, రాజా మాజీ వ్యక్తిగత కార్యదర్శి చందోలియా తదితరులకు బెయిల్ లభించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment