తగలబడుతున్న కొంపలా రాష్ట్రం: కేసీఆర్

హైదరాబాద్,ఫిబ్రవరి 2:  రాష్ట్రం  తగలబడుతున్న కొంపలా ఉందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. జూనియర్ వైద్యులు, 104 సిబ్బంది, వస్త్రా వ్యాపారులు, బీఈడీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని   విలేకరుల సమావేశంలో  అన్నారు. తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని, తెలంగాణ సాధించే వరకు ఉద్యమం ఆగేది లేదని, తెలంగాణ సాధించుకోకుండా ఆగేదే అయితే 11 ఏళ్లుగా సాగి ఉండేది కాదని  అన్నారు. తెరాస కార్మిక విభాగం డైరీనీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తోలు మందం ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలని, గుడ్డి, చెవిటి, మూగ ప్రభుత్వం కేంద్రంలో ఉందని, కేంద్రం దిగి రాక తప్పదని ఆయన అన్నారు. అందరి రంగులు బయటపడ్డాయని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు విశ్రమించబోమని ఆయన అన్నారు. ఆందోళనలు చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని అంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఎస్మా రెడ్డి అని ఆయన అభివర్ణించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు