హైదారాబాద్,ఫిబ్రవరి 29: రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏడు స్థానాలకు మొత్తం 126 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. మార్చి ఒకటవ తేదిన నామినేషన్ల పరిశీలన, మార్చి 3 తేదిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది అని భన్వర్లాల్ తెలిపారు. మొత్తం ఏడు ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు 1660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామని.. వాటిలో 477 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 427 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని భన్వర్లాల్ తెలిపారు.
టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కష్టమని సీపీఐ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని నారాయణ తెలిపారు. రాజీనామా చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతిస్తామని ఆయన తెలిపారు. కోవూరులో సీపీఎంకు మద్దతిస్తామన్నారు.
ఎంపీ మేకపాటి రాజీనామా ఆమోదం
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి రాజీనామాను లోకసభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. సీబీఐ చార్జిషీట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం రాజీనామా నిర్ణయాన్ని మేకపాటి నుంచి ఫోన్ ద్వారా స్పీకర్ తెలుసుకున్నారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మేకపాటి స్పష్టం చేయడంతో స్పీకర్ రాజీనామాను ఆమోదించారు.
టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కష్టమని సీపీఐ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని నారాయణ తెలిపారు. రాజీనామా చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతిస్తామని ఆయన తెలిపారు. కోవూరులో సీపీఎంకు మద్దతిస్తామన్నారు.
ఎంపీ మేకపాటి రాజీనామా ఆమోదం
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి రాజీనామాను లోకసభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. సీబీఐ చార్జిషీట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం రాజీనామా నిర్ణయాన్ని మేకపాటి నుంచి ఫోన్ ద్వారా స్పీకర్ తెలుసుకున్నారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మేకపాటి స్పష్టం చేయడంతో స్పీకర్ రాజీనామాను ఆమోదించారు.
No comments:
Post a Comment