Thursday, February 2, 2012

122 2జీ లైసెన్సుల రద్దు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 2:  2జీ కేసులో జారీ చేసిన మొత్తం 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. 2జీ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రముఖ లాయర్ ప్రశాంత్‌ భూషణ్ పిటిషన్‌పై సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. 2008లో జారీ చేసిన లైసెన్సలన్నింటికీ 2001 ప్రకారం లెక్క కట్టారని ఉన్నత థర్మాసనం తేల్చి చెప్పింది. అంతే కాకుండా అక్రమంగా లైసెన్సులు పొందిన ఒక్కో కంపెనీకి ఐదు కోట్లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించాల్సిన కంపెనీల్లో యూనిటెక్‌, టాటా టెల్లీ, డి బి రియాల్టీ  ఉన్నాయి.మరోవైపు 2జీ కేసులో చిదంబరాన్ని చేర్చాలన్న జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌లో చిదంబరానికి తాత్కాలికంగా ఊరట లభించింది. కేసు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించింది. కాగా, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో 122 లెసైన్సులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరానికి సంబంధం లేదన్నారు. కేంద్ర టెలికం విధానం సవ్యంగానే ఉందని సమర్థించుకున్నారు. 4జీ స్పెక్ట్రమ్ లెసైన్సుల వేలాన్ని ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్నట్టు చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...