హైదరాబాద్ , ఫిబ్రవరి 21: ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. స్టేషన్ ఘన్ పూర్ - ప్రతాప్, ఆదిలాబాద్ - రామచంద్రారెడ్డి, కొల్లాపూర్ - విష్టువర్ధన రెడ్డి, కామారెడ్డి - రాజారెడ్డి, మహబూబ్ నగర్ - ముత్యాల ప్రకాశ్, కోవూరు - పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు - దామోదర రెడ్డి పోటీ చేస్తారు. ఎఐసిసి అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి కోరిక మేరకే అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థుల విషయం చర్చించడానికి ఢిల్లీ చేరుకోనుండగా, అధిష్టానవర్గం అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటింఅం గమనార్హం. మరోవైపు మహబూబ్ నగర్ శాసనసభా స్థానం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజేశ్వర రెడ్డి భార్య విజయలక్ష్మి ప్రకటించారు. 2009 ఎన్నికలలో రాజేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గుండెపోటు కారణంగా ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆయన భార్య విజయలక్ష్మికే ఉప ఎన్నికలలో టిక్కెట్ ఇస్తారని భావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు విజయలక్ష్మి ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment