ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై వేటు

న్యూఢిల్లీ,జనవరి 25:    వివాదాస్పదమైన యాంత్రిక్స్ - దేవాస్ డీల్‌లో ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్‌తో పాటు మరో ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను ప్రభుత్వ పదవులకు అనర్హులుగా ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇస్రో ఎస్ బాండ్ స్పెక్ట్రమ్‌ను ప్రైవేట్ కంపెనీకి కేటాయించిందనే ఆరోపణలపై ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. నాయర్‌తో పాటు ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ కె. భాస్కర నారాయణ, యాంత్రిక్స్ కమర్షియల్ ఆర్మ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఆర్ సిద్ధమూర్తి, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ కెఎన్ శంకరలపై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవాస్‌తో కాంట్రాక్టు కుదిరింది. చంద్రయాన్ 1 ప్రాజెక్టు వెనక మాధవన్ నాయర్ ప్రతిభ ఉంది. దేవాస్ డీల్‌పై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మాధవన్ నాయర్‌పై చర్యలు తీసుకుంది. యాంత్రిక్స్, దేవాస్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ జరపడానికి ప్రధాని మే 31వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషన్ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కాగా ఇస్రో ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్ తనను ఈ వ్యవహారంలో ఇరికించారని, డీల్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మాధవన్ నాయర్ అంటున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు