హైదరాబాద్,జనవరి 23: చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, దానిని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు. దీనికి ప్రతిగా బాలయ్య విశాఖలో స్పందించారు. ఒకరు తనను బాలుడు అన్నారని, అలాంటివారు తనను ఓవైపే చూశారని, రెండోవైపు చూడలేదన్నారు. తన మరోరూపం చూపిస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.సి. ఎం. కావాలని కొందరు కలలు కంటున్నారని, అలాంటివారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సాటిరారని బాలకృష్ణ పరోక్షంగా చిరును విమర్శించారు. పార్టీని అమ్మకున్నవాళ్లా నన్ను విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీవు ఎన్టీఆర్కు పుట్టిన కొడుకువేనా?
మరోవైపు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి కూడా బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ''నీ తండ్రి చావుకు కారణమైన చంద్రబాబుకు మద్దతివ్వాలా? నీకు రోషం, పౌరుషం లేవా? నీవు ఎన్టీఆర్కు పుట్టిన కొడుకువేనా? ఎన్టీఆర్కు ఇటువంటి సంతానం కలగడం చాలా బాధగా ఉంది’’ అని బాలకృష్ణను ఉద్దేశించి లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. చిరంజీవి అన్నట్లు బాలకృష్ణది చిన్నపిల్లవాడి మన:స్తతత్వం అన్నారు. బాలకృష్ణకు రాజకీయ అవగాహనలేదని చెప్పారు. ప్రజల్లో విశ్వసనీయతలేని చంద్రబాబు అధికార కోసం నందమూరి వంశాన్ని కరివేపాకులా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇన్తకుముందు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను ఇదే మాదిరిగా ఉపయోగించుకున్నారని, పదవి కోసం సొంత మనుషులను తాకట్టు పెట్టే నీచమైన సంస్కృతి చంద్రబాబుదని, పదవి వ్యామోహంతో బాలకృష్ణను తన వైపు తిప్పుకొనేందుకే కొడుకు లోకేష్కు బాలకృష్ణ కూతురితో పెళ్లి జరిపించారని లక్ష్మిపార్వతి దుయ్యబట్టారు.
No comments:
Post a Comment