హైదరాబాద్,జనవరి 24: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు, జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు. సునీల్ రెడ్డిని వెంట తీసుకువెళ్లి పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 120 బి. 409, 420,477 సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేశారు. అరెస్ట్ విషయాన్ని సునీల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు.స్టైలిష్ హోమ్స్ రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. విల్లాలను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్కు అందించడంలో లేదా జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment