Friday, January 6, 2012

చంచల్ గూడ జైలుకు శ్రీలక్ష్మి

హైదరాబాద్ , జనవరి 6:  ఓఎంసి కేసులో  ఐఎస్ఎస్ అధికారి శ్రీలక్ష్మినాంపల్లి సిబిఐ కోర్టులో  లొంగిపోయారు.  ఆమెకి నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలనే సుప్రీం కోర్టు సమర్ధించడం తో  ఈ నెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈరోజు లొంగిపోయారు. ఈ నెల 12 వరకు కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఆమెని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణని కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదావేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...