హైదరాబాద్,జనవరి 24: చిరంజీవి, బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం వారి అభిమానుల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు చిరంజీవిని సమర్థిస్తూ బాలయ్యను దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం నాయకులు బాలయ్యను సమర్థిస్తూ చిరంజీవిని విమర్శిస్తున్నారు. మరోవైపు సినీ ప్రపంచంలో అగ్ర హీరోలు కావడంతో వారి అభిమానులు కూడా రెండుగా చీలిపోయి ఘర్షణకు దిగే వాతావరణం ఏర్పడింది. నెల్లూరు, తిరుపతిల్లో ఈ హీరోల అబిమానులు రెండుగా చీలిపోయి, రోడ్ల మీదికి వచ్చి ఘర్షణ పడ్డారు. చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అభిమానులు నెల్లూరులోని శ్రీ వివేకానంద సెంటర్లో బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు బాలయ్య అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు పోటా పోటీగా నినాదాలు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పరిస్థితులు అదుపులో ఉంచేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. తిరుపతిలో కూడా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య ఘర్షణ తో ఉద్రిక్తత నెలకొంది. నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులకు దిగాయి. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment