వాషింగ్టన్,జనవరి 11: మనిషి ఎంతకాలం జీవించగలుగుతాడన్న విషయాన్ని వారి యుక్త వయసులోనే అంచనా వేయొచ్చని ఓ పరిశోధన ద్వారా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనిషి దేహ కణాల్లో నిచ్చెన రూపంలోని డీఎన్ఏ అనే జన్యు పదార్థంప్రోటీన్లతో నిర్మితమైన క్రోమోజోమ్లో భాగంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే క్రోమోజోమ్ల రెండు చివర్లా ఉండే అతిచిన్న ‘టీలోమర్’ నిర్మాణాల పొడవును బట్టి మనిషి ఆయుర్దాయాన్ని అంచనా వేయొచ్చంటున్నారు బ్రిటన్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో’ శాస్త్రవేత్తలు. పిచ్చుకల మాదిరిగా ఉండే 99 ‘జీబ్రా’ పిట్టలపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలిందన్నారు. అధ్యయనంలో భాగంగా తొలుత 25 రోజుల వయసులోని పిట్టల క్రోమోజోమ్ల చివర్లో ఉన్న టీలోమర్ల పొడవును వారు నమోదుచేశారు. తర్వాత ఏడాదికోసారి, ఆ తర్వాత ఏటా వివరాలు రికార్డుచేశారు. ఆ తర్వాత ఆకలి చావులు, ఇతర జంతువుల దాడి, ప్రమాదాలు, జబ్బుల కారణంగా మరణించినవాటిని మినహాయించి సహజంగా చనిపోయినవాటిని పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని పరిశోధన బృందం సారథి హిడింగర్ తెలిపారు. యుక్తవయసులో టీలోమర్లు పొడవుగా ఉన్న పక్షులు ఎక్కువ కాలం అత్యధికంగా 8.7 ఏళ్ల వరకు జీవించాయని, తక్కువ పొడవు ఉన్న పిట్టలు త్వరగా చనిపోయాయన్నారు. అయితే యుక్తవసులో ఉన్నప్పటి టీలోమర్ల పొడవు మాత్రమే ఆయుర్దాయం పరిమాణంతో సరిపోలుతోందని, మనుషుల్లో కూడా ఇలాంటి పరిశోధన నిర్వహిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే వుంది. ఎప్పుడు పోతామో తెలిస్తే టెన్షన్ తో గుండె ఆగి ఇంకా ముందే పోవచ్చు...!
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment