స్వాతంత్ర్య సమరయోధుడు ఎంఎస్ రాజలింగం మృతి

హైదరాబాద్,జనవరి 23:  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఎంఎస్ రాజలింగం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటు తో మృతి చెందారు. రాజలింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఆయన వయస్సు తొంబై మూడేళ్లు. గాంధీ భవన్  ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా  ఉన్న  రాజలింగం 1919లో వరంగల్ జిల్లాలో జన్మించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు మంత్రివర్గంలో పని చేశారు. 1964లో న్యాయవాద వృత్తి స్వీకరించారు. ఇటీవల డిసెంబర్ 28న కాంగ్రెసు ఆవిర్భావ వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనను  సత్కరించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు