తొలిరోజు పై చేయి అసీస్ దే ...
సిడ్నీ,జనవరి 3: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం మొదలైన రెండవ టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది. మూడి వికెట్లనూ జహీర్ ఖాన్ తీసుకున్నాడు. అంతకుముందు భారత్ జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయింది. ధోనీ 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సచిన్ 41, సెహ్వాగ్ 30, కొహ్లీ 23, అశ్విన్ 20, ద్రావిడ్ 5, లక్ష్మణ్ 2, పరుగులు చేయగా, గంభీర్, జహీర్, ఇషాంత్, యాదవ్ డకౌట్ అయ్యారు. ఆసిస్ బౌలర్లు ప్యాటిన్సన్ కు 4 వికెట్లు, సిడేల్, హిల్వేఫనాన్కు మూడేసి వికెట్లు దక్కాయి.
Comments