అమలాపురం,జనవరి 23: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాల ధ్వంసంతో అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ చర్యను నిరసిస్తూ స్థానిక దళిత నేతలు ఆందోళనకు దిగారు. అమలాపురం వచ్చే ప్రధాన మార్గాలను దిగ్బంధించి నిరసన తెలిపారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక అధికారిగా రామచంద్రాపురం డిఎస్ పిని నియమించారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్ . పి త్రివిక్రమవర్మతో హోం మంత్రి సబిత చర్చలు జరిపారు. బాధ్యులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. మరోవైపు అమలాపురంలో వారం రోజులపాటు 144 సెక్షన్ విధించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment