అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంతో అట్టుడికిన అమలాపురం...

అమలాపురం,జనవరి 23:   తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాల ధ్వంసంతో  అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ చర్యను నిరసిస్తూ స్థానిక దళిత నేతలు ఆందోళనకు దిగారు. అమలాపురం వచ్చే ప్రధాన మార్గాలను దిగ్బంధించి నిరసన తెలిపారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై  రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక అధికారిగా రామచంద్రాపురం డిఎస్ పిని నియమించారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్ . పి త్రివిక్రమవర్మతో హోం  మంత్రి సబిత చర్చలు జరిపారు. బాధ్యులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. మరోవైపు అమలాపురంలో వారం రోజులపాటు 144 సెక్షన్ విధించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు