Sunday, January 15, 2012

తెలంగాణా తేలాల్సింది రాష్ట్రంలోనే: లగడపాటి

విజయవాడ,జనవరి 15: ప్రత్యేక తెలంగాణ అంశం ఇప్పుడే కాదు.. ఎప్పటికీ తేలదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ముందు ఎటువంటి పరిష్కారం లేదన్నారు. ఈ సమస్యకు రాష్ట్రంలోనే పరిష్కార మార్గం కనుగొనాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపితేనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా, ఈ తీర్మానం చేసినప్పటికీ తెలంగాణ ఏర్పాటవుతుందని చెప్పలేమన్నారు. అసెంబ్లీలో తీర్మానం అనేది రాష్ట్ర ఏర్పాటుకు మొదటి మెట్టు వంటిదన్నారు. ఆ తర్వాత అన్ని అంశాలపై అధ్యయనం చేసి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...