మణిపూర్ శాసనసభ ఎన్నికలలో హింస: ఇద్దరి మృతి
ఇంఫాల్, జనవరి 28: శనివారం జరిగిన మణిపూర్ శాసనసభ ఎన్నికలలో హింస చోటు చేసుకుంది. చందేల్ పోలింగ్ కేంద్రంపై తీవ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నించారు. సిఆర్ పిఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. జవాన్లుకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక జవాన్, ఒక మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. కాగా, ఈ ఎన్నికలలో 82 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 279 మంది పోటీ పడ్డారు.
Comments