సిరీస్ అసీస్ స్వాహా...
అడిలైడ్,జనవరి 28: అడిలైడ్ టెస్ట్లో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నాలుగు టెస్ట్ల సిరీస్ను 4-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో వరుసగా రెండు సిరీస్లను 4-0 తేడాతో ఇండియా ఓడిపోయింది. గత ఏడాది జూలై, ఆగస్టుల్లో ఇంగ్లండ్లో జరిగిన నాలుగు టెస్ట్ల సిరీస్ను 4-0 తేడాతో ఓడిన టీమిండియా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో అదే మార్జిన్తో ఓటమి పాలైంది. ఈ వరుస ఓటముల నేపథ్యంలో గత ఏడాది నంబర్ వన్ ర్యాంక్లో వున్న టీమిండియా తాజాగా, మూడో ర్యాంక్కు దిగజారింది. ప్రపంచ ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో వున్న భారత్ జట్టు విదేశీ గడ్డపై వరుస ఓటముల పాలవడం ఇదే ప్రథమం. కాగా, ఈ ఓటమికి ఎవరూ కుంగిపోయి రిటైరవ్వాల్సిన అవసరం లేదని ఇంఛార్జి కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కొన్నేళ్లుగా ఇండియా బ్యాటింగ్ బ్రహ్మాండంగా వుందని, ఈ రెండు టూర్లలో బ్యాట్స్మెన్ విఫలమయ్యారని చెప్పాడు.
Comments