Friday, January 27, 2012

పుంజుకుంటున్న రూపాయి

ముంబయి,జనవరి 27: రిజర్వ్‌ బ్యాంకు తీసుకున్న చర్యలు, దేశంలోకి విదేశీ మదుపుదారులు డాలర్లు తీసుకురావడంతో రూపాయి క్రమంగా  బలపడుతోంది. నవంబరు 9 తర్వాత మళ్లీ 49 రూపాయల 60 పైసల స్థాయికి రూపాయి బలపడింది.  మార్చి నాటికి 46కు వస్తుందని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా రూపాయి బలానికి కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే యూరో బలపడటం... స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇండియన్‌ కరెన్సీవిలువ పెరుగుతోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...