Tuesday, January 10, 2012

అధ్యక్ష ఎన్నికల బరిలో లేనన్న జిందాల్

లూసియానా గవర్నర్‌గా రెండో పర్యాయం బాధ్యతలు చెపట్టిన జిందాల్ 
హూస్టన్ ,జనవరి 11:  భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ (40) అమెరికాలోని లూసియానా గవర్నర్‌గా రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్యాథరీన్ కిటీ కింబాల్ ఆయన చేత  ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యా రంగంపై ప్రధానంగా దృష్టి పెడతానని ప్రమాణ స్వీకారం తర్వాత జిందాల్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను పూర్తిచేసే దాకా విశ్రమించబోనని అన్నారు. లూసియానా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పారు. ఉద్యోగాలు పెంచాలని, ప్రభుత్వ విద్యారంగంలో సాధించాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గతేడాది అక్టోబర్ 22న లూసియానా గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జిందాల్ 50 శాతంపైగా ఓట్లతో విజయం సాధించారు. రాష్ర్ట ప్రజలు మరోమారు ఆయనకు పట్టం కట్టారు. గవర్నర్ పదవిని చేపట్టిన తొలి ఇండియన్ అమెరికన్‌గా ఖ్యాతికెక్కిన జిందాల్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే  2012 అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...