Tuesday, January 24, 2012

ఆఖరి టెస్ట్ లోనూ అదే వరస...!

అడిలైడ్,జనవరి 24:  నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో గెలిచిన అసీస్ నాల్గవ, ఆఖరి టెస్ట్ లో కూడా భారత్ జట్టు ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   అడిలైడ్‌లో మంగళవారం మొదలైన  నాల్గవ టెస్టులో ఆస్టేలియా -మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ప్రస్తుత కెప్టెన్ మైఖెల్ క్లార్క్ వీరోచిత బ్యాటింగ్‌తో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి  3 వికెట్లను కోల్పోయి 335 పరుగులు చేసింది. మొదటి టెస్టులో మాదిరే రికీ పాంటింగ్, మైఖెల్ క్లార్క్ ఇద్దరూ కూడా సెంచరీని నమోదు చేశారు. 84 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను రికీ పాంటింగ్ 137, మైఖెల్ క్లార్క్ 140 పరుగులతో ఆదుకున్నారు.  రికీ పాంటింగ్ 137 పరుగులు చేయడంతో 13, 000 పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అటు క్లార్క్ కూడా కెరీర్‌లో 19వ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో అతనికిది రెండో సెంచరీ.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...