స్పల్పంగా పక్కకు ఒరిగిన తాజ్‌మహల్‌ మినార్‌

న్యూఢిల్లీ,జనవరి 28:  ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ నాలుగు మినార్‌లలో ఒకటి స్పల్పంగా పక్కకు ఒరిగింది. నైరుతి దిక్కున ఉన్న ఈ మినార్ తాజ్‌మహల్ నిర్మాణం జరిగినప్పటి నుంచి నిలకడగా ఉన్నప్పటికీ మూడు దశాబ్దాల కాలంలో 3.57 సెంటీ మీటర్ల మేరకు పక్కకు ఒరిగింది. నాలుగు మినార్‌ల ఎత్తులో మాత్రం తేడా ఏర్పడలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్‌ఐ ఈ వివరాలను సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాజ్‌మహల్‌కు పర్యావరణ కాలుష్యం వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయంపై స్పందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏఎస్‌ఐ తమ నివేదికను సమర్పించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు