Saturday, January 28, 2012

స్పల్పంగా పక్కకు ఒరిగిన తాజ్‌మహల్‌ మినార్‌

న్యూఢిల్లీ,జనవరి 28:  ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ నాలుగు మినార్‌లలో ఒకటి స్పల్పంగా పక్కకు ఒరిగింది. నైరుతి దిక్కున ఉన్న ఈ మినార్ తాజ్‌మహల్ నిర్మాణం జరిగినప్పటి నుంచి నిలకడగా ఉన్నప్పటికీ మూడు దశాబ్దాల కాలంలో 3.57 సెంటీ మీటర్ల మేరకు పక్కకు ఒరిగింది. నాలుగు మినార్‌ల ఎత్తులో మాత్రం తేడా ఏర్పడలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్‌ఐ ఈ వివరాలను సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాజ్‌మహల్‌కు పర్యావరణ కాలుష్యం వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయంపై స్పందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏఎస్‌ఐ తమ నివేదికను సమర్పించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...