Tuesday, January 10, 2012

అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం

వాషింగ్టన్,జనవరి 11:  అమెరికాలోని అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. దీంతో న్యూయార్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌లలో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలతో కలిపి అమెరికాలో మొత్తం ఐదు కార్యాలయాలు భారతీయులకు సేవ లందిస్తున్నాయి. అట్లాంటాలోని ఈ నూతన కాన్సులేట్ ద్వారా  జార్జియా పరిధిలోని లక్ష మంది వరకూ భారతీయులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఆగ్నేయ అమెరికాలో సుమారు 2 లక్షల 90 వేల మందికి ఈ కాన్సులేట్ ద్వారా ప్రయోజనం కలగనుంది. సీనియర్ భారత దౌత్యవేత్త అజిత్ కుమార్‌ను నూతన కాన్సులేట్‌కు మొదటి కాన్సుల్ జనరల్‌గా భారత్ నియమించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...