హైదరాబాద్ మేయర్ గా మొహ్మద్ మజీద్ హుస్సేన్

హైదరాబాద్ ,జనవరి 3:   గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గా అహ్మద్ నగర్ కార్పోరేటర్ మొహ్మద్ మజీద్ హుస్సేన్ ని ఎంఐఎం ఎంపిక చేసింది.  కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందంలో భాగంగా  రెండేళ్ళ కాలానికి ఎంఐఎం కు  మేయర్ పదవి లభించింది. 21 సంవత్సరాల తరువాత మేయర్ పగ్గాలను ఎంఐఎం చేపట్టబోతోంది.కాగా, డిప్యూటీ  మేయర్‌గా కాంగ్రెస్ కు చెందిన కవాడిగూడ కార్పోరేటర్ రాజ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. ఐదేళ్ల పాలనలో మొదటి రెండేళ్లు కాంగ్రెసు, ఆ తర్వాత రెండేళ్లు ఎంఐఎం, చివరి ఏడాది మళ్లీ కాంగ్రెసుకు మేయర్‌గా అవకాశం దక్కుతుంది.  మొదటి  రెండేళ్ళపాటు  మేయర్ గా పనిచేసిన బండ  కార్తీక రెడ్డి నెలక్రితమే రాజీనామా చేశారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు