Tuesday, January 24, 2012

రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు

హైదరాబాద్,జనవరి 24:  రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.వీరిలో 2,78, 48,792 మంది పురుష ఓటర్లు, 2,79,14,616 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డులలో తొలి స్థానం ఆంధ్రప్రదేశ్ దేనని చెప్పారు. 40 లక్షల నకిలీ ఓటరు కార్డులు తొలగించినట్లు తెలిపారు. 20 మంది హిజ్రాలకు కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఎపి ఆన్ లైన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. బుధవారం  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 33 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...