రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు

హైదరాబాద్,జనవరి 24:  రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.వీరిలో 2,78, 48,792 మంది పురుష ఓటర్లు, 2,79,14,616 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డులలో తొలి స్థానం ఆంధ్రప్రదేశ్ దేనని చెప్పారు. 40 లక్షల నకిలీ ఓటరు కార్డులు తొలగించినట్లు తెలిపారు. 20 మంది హిజ్రాలకు కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఎపి ఆన్ లైన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. బుధవారం  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 33 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు