అడిలైడ్,జనవరి 26: ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 272 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో అత్యధికంగా విరాట్ కోహ్లీ 116 పరుగులు చేయగా , సాహా 35, గంభీర్ 34, సచిన్ 25 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో సిడిల్ 5 వికెట్లు, హిల్ఫెనాస్ 3, హారిస్, లియాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. పాంటింగ్ 1, క్లార్క్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. వార్నర్ 28, కోవాన్ 10, మార్ష్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. అశ్విన్ 2, జహీర్ 1 వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 382 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment