Tuesday, January 3, 2012

‘టీవీ-18’ కి ఈటీవీ ఛానళ్ల అమ్మకం

ముంబై,జనవరి 3: :  ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు  తమ గ్రూప్‌కు చెందిన ఈటీవీ ప్రాంతీయ ఛానళ్లను సేల్ చేసెస్తున్నారు.  బిజినెస్ న్యూస్ చానళ్లను నడిపే రాఘవ్ బెహల్‌కు చెందిన ‘టీవీ-18’ సంస్థతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సబ్సిడీ కంపెనీ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ లిమిటెడ్-ఇన్ఫోటెల్ టీవీ 18, ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ గ్రూప్‌తో చర్చలు ఫలించాయి. 2600 కోట్ల రైట్స్ ఇష్యూ ద్వారా 100 శాతం న్యూస్ ఛానల్స్, 50 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్, 24.5 శాతం తెలుగు ఈటీవీ న్యూస్ ఛానల్స్ లో వాటా కొనుగోలు చేయడానికి ఆర్‌ఐఎల్ బోర్డు అంగీకారం తెలిపింది. తొలుత  ఛానళ్ల అమ్మకానికి సోని టీవీతో రామోజీ చర్చలు జరిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...