Saturday, December 24, 2011

ఉరేసుకుందాం రా...కెసిఆర్ ను సవాల్ చేసిన 'దేశం' నేతల అరెస్ట్

హైదరాబాద్,డిసెంబర్ 24:  ఉరేసుకుందాం రమ్మంటూ తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సవాల్ చేస్తూ తాడుతో హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద హంగామా చేసిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును, మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. వారితో పాటు తెలుగుదేశం ఇతర నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని హైదరాబాదులోని నాంపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు. తనకు, కెసిఆర్‌కు తాడు తెచ్చానని, ఇద్దరం ఉరేసుకుందాం రావాలని మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌ను సవాల్ చేశారు. కెసిఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే కెసిఆర్ ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పిట్టల దొరలాగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ వద్ద ఉన్నది కట్టె తుపాకి అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు వారిని  అరెస్టు చేసే సమయంలో గన్ పార్కు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు గన్‌పార్కు వైపు రావడానికి ప్రయత్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని తెరాస కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కొంత మంది తప్పించుకుని గన్ పార్కుకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...