హైదరాబాద్ ,నవంబర్ 4: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్ను ఏడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోనేరు ప్రసాద్ను 15 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరగా, ఏడు రోజుల పాటు అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన తర్వాత కోనేరు ప్రసాద్ను గురువారం సిబిఐ అధికారులు అధికారులు అరెస్టు చేశారు. కాగా, కోనేరు ప్రసాద్కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయాలపై సిబిఐ ఆరా తీస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితోనూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతోనూ అతనికి గల సంబంధాలపై సిబిఐ విచారణ సాగిస్తోంది. రికార్డుల్లో గజానికి ఐదు వేల రూపాయలు మాత్రమే చూపించి ఎమ్మార్ - ఎంజిఎఫ్ అభివృద్ది చేసిన టౌన్షిప్లోని విల్లా స్థలాలను గజానికి 25 వేల నుంచి 50 వేల రూపాయలకు అమ్మినట్లు కోనేరు ప్రసాద్పై ఆరోపణలున్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ -ఎపిఐఐసి ఈక్విటీని బలహీనపరిచినట్లు, దానికి కోట్లాది రూపాయలు నష్టం కలిగించినట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment