Tuesday, November 15, 2011

భారత్ ' శత ' క్కొట్టుడు...!

కోల్ కతా,నవంబర్ 15:  వెస్టిండీస్ -భారత్ జట్లమధ్య కోల్ కతాలో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో రోజున భారత్ 631 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో హైదరాబాదీ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్   176 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మంగళవారం బరిలోకి దిగిన భారత్  పరుగుల సునామీ సృష్టించింది. ఈ మ్యాచ్ లో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయటం విశేషం. రాహుల్ ద్రావిడ్ 119, టీమిండియా కెప్టెన్ ధోనీ 144 పరుగులు చేయగా లక్ష్మణ్ 176 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మొదట్లోనే  తొలి వికెట్ ను కోల్పోయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...