Saturday, November 5, 2011

‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ భూపేన్ హజారికా మరిలేరు

హైదరాబాద్,నవంబర్ 6:  ‘దిల్ హూమ్ హూమ్ కరే..’, ‘ఓ గంగా బెహతీ హో..’ లాంటి మరపురాని గీతాలు ఆలపించిన సంగీత, సాహిత్య దిగ్గజం భూపేన్ హజారికా కన్ను ముశారు. నాలుగు నెలలకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల హజారికా  శనివారం సాయంత్రం ముంబై ఆస్పత్రిలో తుది శ్వాశ విడిచారు.   అస్సామీ సంప్రదాయ, గిరిజన సంగీతాల నుంచి అద్భుతం, అపురూపమైన స్వరజగతిని సృష్టించి శ్రోతల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన హజారికా ను  అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి గుర్తుగా  ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ గా పిలుస్తారు. హజారికా అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు వందలాది పాటలు రాసి, స్వరకల్పన చేశారు. శకుంతల,ప్రతిధ్వని తదితర అస్సామీ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. వాటికి సంగీతమూ అందించారు. పాటలూ పాడారు. కల్పనా లాజ్మీతో కలిసి రూపొందించిన రుదాలి, ఏక్‌పల్, దార్మియాన్, దామన్, క్యోన్ వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఈ ఏడాది విడుదలైన ‘గాంధీ టు హిట్లర్’ సినిమాలో ‘వైష్ణవ జన్..’ పాట ను ఆయన చివరగా పాడారు. 976 లో జాతీయ ఉత్తమ సంగీతదర్శకుని అవార్డ్ అందుకున్న  హజారికా 1977లో పద్మశ్రీ, 1992లో దాదా ఫాల్కే, 2001లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1967-72 మధ్య ఎమ్మెల్యే (అస్సాం) గా. 1999-2004 మధ్య సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా పని చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...