హైదరాబాద్, నవంబర్ 24: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, విదేశాల్లోని బినామీల లావాదేవీల గుట్టును రట్టుచేసేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సన్నద్ధమవుతోంది. బాబు తనయుడు లోకేశ్ విదేశీ చదువులకు చెల్లింపులెలా జరిగాయి, వాటినెవరు చెల్లించారనే కోణంలో పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తోంది. మలేసియా, సింగపూర్లలో బాబు ఆస్తుల వివరాలతో పాటు ఆయన బినామీలైన సీఎం రమేశ్, సుజనా చౌదరి పలు దేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా కూపీ లాగనుంది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారం బాబు, ఆయన బినామీలు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులకు వారంతా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. వారందించే డాక్యుమెంట్ల తో ఈడీ సంతృప్తి చెందని పక్షంలో అదనపు సమాచారం కోరే అవకాశముంది. ఆ సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి. లోకేశ్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్లో మెరిట్ స్టూడెంట్ కాని ఆయనకు డొనేషన్లు కడితే తప్ప వాటిలో సీటు దక్కే అవకాశమే లేదు. దాంతో ఆ చదువులకు సుమారు రూ. 23 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ వ్యవహారం పై ఈడీ దృష్టి పెట్టే అవకాశం వుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment