కోమటిరెడ్డి దీక్ష భగ్నం : నిమ్స్ లో చికిత్స

హైదరాబాద్,నవంబర్ 6:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను  పోలీసులు భగ్నం చేశారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న కోమటిరెడ్డిని  ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయనను  చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లోని అత్యవసర చికిత్స విభాగంలో ఆయకు చికిత్స చేస్తున్నారు. నిమ్స్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు