ప్రదానం చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం
కోయంబత్తూరు, నవంబర్ 24: జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం దేశానికి పెను సవాలేనని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగ ప్రగతికి కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనను ఇక్కడి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వర్సిటీ స్నాతకోత్సవ సభలో వర్సిటీ చాన్సలర్ , తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య దీన్ని ప్రదానం చేశారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ,రైతుల పక్షాన దేశంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగ పునరుజ్జీవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, గవర్నర్ రోశయ్య ఎనలేని కృషిచేశారని ప్రశంసించారు. వారిద్దరి వద్ద ఆరున్నరేళ్లు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసి రైతులకు సేవ చేయడం తన అదృష్టమని రఘువీరా చెప్పారు.
కోయంబత్తూరు, నవంబర్ 24: జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం దేశానికి పెను సవాలేనని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగ ప్రగతికి కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనను ఇక్కడి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వర్సిటీ స్నాతకోత్సవ సభలో వర్సిటీ చాన్సలర్ , తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య దీన్ని ప్రదానం చేశారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ,రైతుల పక్షాన దేశంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగ పునరుజ్జీవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, గవర్నర్ రోశయ్య ఎనలేని కృషిచేశారని ప్రశంసించారు. వారిద్దరి వద్ద ఆరున్నరేళ్లు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసి రైతులకు సేవ చేయడం తన అదృష్టమని రఘువీరా చెప్పారు.
No comments:
Post a Comment