రిటైల్ ఎఫ్.డి.ఐ.ల పై కొనసాగుతున్న పార్లమెంటు ప్రతిష్టంభన

న్యూఢిల్లీ,నవంబర్ 29:   రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినా ప్రతిష్టంభన తొలగిపోలేదు.  మంగళవారం కూడా   ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.  ఈ సమావేశంలో ఇరు పక్షాలు కూడా తమ పట్టును వీడలేదు. రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల మనోభావాలను ప్రధానికి తెలిపి, ప్రభుత్వం ప్రతిస్పందించడానికి కొంత సమయం కావాలని ప్రణబ్ ముఖర్జీ  వారికి చెప్పినట్టు సమాచారం . 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు