న్యూఢిల్లీ,నవంబర్ 29: రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినా ప్రతిష్టంభన తొలగిపోలేదు. మంగళవారం కూడా ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ సమావేశంలో ఇరు పక్షాలు కూడా తమ పట్టును వీడలేదు. రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల మనోభావాలను ప్రధానికి తెలిపి, ప్రభుత్వం ప్రతిస్పందించడానికి కొంత సమయం కావాలని ప్రణబ్ ముఖర్జీ వారికి చెప్పినట్టు సమాచారం .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment