Saturday, November 12, 2011

రాజీనామా లేఖలపై కదలిక

 నాగం , నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిల రాజీనామాల  ఆమోదం  
హైదరాబాద్,నవంబర్ 13:   తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు.  తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో నాగం, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో దివంగత  వైఎస్ పేరును చేర్చడాన్ని నిరసిస్తూ ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నల్లపురెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అంతకుముందు ఫిర్యాదు ఇచ్చింది. ఆ పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన స్పీకర్ తీర్పును రిజర్వులో ఉంచారు. ఈలోగా ప్రసన్న రాజీనామా లేఖ ఇవ్వడంతో స్పీకర్ టీడీపీ పిటిషన్‌ను తిరస్కరించి ఆయన ఇచ్చిన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇక నాగం తన రాజీనామా ఆమోదం కోసం పలుమార్లు స్పీకర్‌పై   ఒత్తిడి చేశారు. ధర్నాలు చేసి పట్టుబట్టడమే కాకుండా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ తరుణంలో ఆయన రాజీనామాను కూడా మనోహర్ ఆమోదించారు. స్పీకర్ వద్ద  ఇంకా 79 మంది రాజీనామాలు పెండింగ్‌లో ఉన్నాయి.  టీడీపీ నుంచి 34 మంది, టీఆర్‌ఎస్ నుంచి  16 మంది, కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరి రాజీనామా లేఖలు స్పీకర్ వద్ద పరిశీలనలో ఉన్నాయి. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీల నుంచి 25 మంది చేసిన రాజీనామాలు కూడా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...