ముంబై, నవంబర్ 24: మూడవ, ఆఖరి టెస్టులో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. చరిత్రలో తొలిసారి వెస్టిండీస్ టాప్ 6 ఆటగాళ్లు కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం. . బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరీబియన్ జట్టు 181 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు సాధించింది. డారెన్ బ్రావో (284 బంతుల్లో 166; 17 ఫోర్లు) సెంచరీ సాధించగా... ఎడ్వర్డ్స్ (165 బంతుల్లో 86; 13 ఫోర్లు) ముందు రోజు జోరును కొద్దిసేపు కొనసాగించాడు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పావెల్ (149 బంతుల్లో 81; 9 ఫోర్లు), శామ్యూల్స్ (103 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ఆట ముగిసే సమయానికి టెయిలెండర్లు ఫిడేల్ ఎడ్వర్డ్స్ (7), బిషూ (2) క్రీజులో ఉన్నారు. తొలి రోజు రెండు వికెట్లు తీసుకున్న అశ్విన్... రెండో రోజు మరో రెండు వికెట్లతో రాణించాడు. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న వరుణ్ ఆరోన్ ఆఖరి సెషన్లో ఒకే స్పెల్లో (6-0-29-3) మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓజా, ఇషాంత్లకు ఒక్కో వికెట్ దక్కింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment