హైదరాబాద్,నవంబర్ 13: 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వసన్నద్దమైంది. సోమవారం నుంచి 20వ తేదీ వరకూ ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు భారత బాలల చలన చిత్రొత్సవ కమిటీ చైర్పర్సన్ నందితాదాస్, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తెలిపారు. దాదాపు 150 సినిమాలను ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పదిచిత్రాలు ఎంపికకాగా.. మన రాష్ట్రానికి చెందిన నాలుగు చిత్రాలు ఉన్నాయి. చిత్ర ప్రదర్శనలకోసం మొత్తం 13 స్క్రీన్లు ఎంపిక చేశారు. ఇందులో మూడు తాత్కాలిక థియేటర్లను శిల్పారామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, సినీ నిర్మాతలు, దర్శకులు. చిత్రోత్సవాల్లో పాల్గొనే చిన్నారులతో సమావేశాలు, బహిరంగ చర్చా గోష్టులతో పాటు ‘లిటిల్ డెరైక్టర్స్’ అనే కొత్త కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. చిత్రోత్సవాల్లో ప్రదర్శించే అంతర్జాతీయ, జాతీయ చిత్రాలకు 4 విభాగాల్లో 15 గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డులు ఇస్తామని నందితాదాస్ తెలిపారు. చిత్రోత్సవాలను లక్షన్నర మంది చిన్నారులు వీక్షిస్తారని , ప్రతి జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి ప్రభుత్వ ఖర్చుతో ఉత్సవాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి అరున చెప్పారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికను భవిష్యత్ లో కూడా హైదరాబాద్లోనే కొనసాగిస్తారని, వేరే ప్రాంతానికి మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించబోదని మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం శాశ్వత వేదికను నిర్మించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment