Wednesday, November 23, 2011

చంద్రబాబు ఆస్తుల కేసులో స్టే కు సుప్రీం 'నో'

హైదరాబాద్, నవంబర్ 24: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ బాబు బినామీలు సీఎం రమేశ్, రామోజీరావు, మధుకాన్ సుగర్స్ (నామా నాగేశ్వరరావు) వేర్వేరుగా దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. బాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, బినామీలు రామోజీరావు, నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, కర్నాటి వెంకటేశ్వరరావు తదితరుల ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే వాటిని హైకోర్టు వద్దే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల సవరణ/ఎత్తివేత కోసం హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేసుకోవాలని చెప్పింది. వాటిని దాఖలు చేసుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...