కార్తీకమాసం పిక్నిక్ విషాదాంతం...

హైదరాబాద్,నవంబర్ 7: కార్తీక సమారాధనలో భాగంగా పిక్నిక్‌కు వెళ్లిన ఆరుగురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయురాలు వశిష్ట గోదావరి నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు దొరకగా.. మిగిలినవారి జాడ కోసం గాలిస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మూడు పాఠశాలలకు చెందిన 73 మంది విద్యార్థులు విహారయాత్రకు కాకరపర్రు వెళ్లారు.  వీరిలోని 10 మంది విద్యార్థులు స్నానం చేసేందుకు కాకరపర్రులోని గోదావరి లంకలో దిగారు. అయితే, లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు.  వెంటనే అప్రమత్తమయిన  టీచర్ లక్ష్మీప్రసన్న, తణుకు బాలుర హైస్కూల్ విద్యార్థి డి.అశోక్‌కుమార్నదిలోకి దిగి వారిని కాపాడేందుకు యత్నించారు. ఈ సమయంలో లక్ష్మీ ప్రసన్న ఓ విద్యార్థిని రక్షించి.. మరొకరిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. మునిగిపోయారు. అశోక్ కుమార్‌కు ఈత రాకున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించి.. ముగ్గురిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు.  గాలింపు కొనసాగుతోంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు