Sunday, November 6, 2011

కార్తీకమాసం పిక్నిక్ విషాదాంతం...

హైదరాబాద్,నవంబర్ 7: కార్తీక సమారాధనలో భాగంగా పిక్నిక్‌కు వెళ్లిన ఆరుగురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయురాలు వశిష్ట గోదావరి నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు దొరకగా.. మిగిలినవారి జాడ కోసం గాలిస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మూడు పాఠశాలలకు చెందిన 73 మంది విద్యార్థులు విహారయాత్రకు కాకరపర్రు వెళ్లారు.  వీరిలోని 10 మంది విద్యార్థులు స్నానం చేసేందుకు కాకరపర్రులోని గోదావరి లంకలో దిగారు. అయితే, లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు.  వెంటనే అప్రమత్తమయిన  టీచర్ లక్ష్మీప్రసన్న, తణుకు బాలుర హైస్కూల్ విద్యార్థి డి.అశోక్‌కుమార్నదిలోకి దిగి వారిని కాపాడేందుకు యత్నించారు. ఈ సమయంలో లక్ష్మీ ప్రసన్న ఓ విద్యార్థిని రక్షించి.. మరొకరిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. మునిగిపోయారు. అశోక్ కుమార్‌కు ఈత రాకున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించి.. ముగ్గురిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు.  గాలింపు కొనసాగుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...