యు.పి. ని నాలుగు ముక్కలు చేయాల్సిందే:మాయావతి

లక్నో,నవంబర్ 15:  పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని  మాయావతి మరోసారి స్పష్టం చేశారు.  మంగళవారం  మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెద్ద రాష్ట్రాలతో ఉపయోగం లేదని, చిన్న రాష్ట్రాలతో చాలా లాభాలున్నాయని మాయవతి అన్నారు. ఈ నెల నవంబర్ 21న విభజనపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు  తెలిపారు.యూపీ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి ప్యాకేజీ తమకు అందలేదన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి బీఎస్పీ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు