Tuesday, November 15, 2011

యు.పి. ని నాలుగు ముక్కలు చేయాల్సిందే:మాయావతి

లక్నో,నవంబర్ 15:  పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని  మాయావతి మరోసారి స్పష్టం చేశారు.  మంగళవారం  మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెద్ద రాష్ట్రాలతో ఉపయోగం లేదని, చిన్న రాష్ట్రాలతో చాలా లాభాలున్నాయని మాయవతి అన్నారు. ఈ నెల నవంబర్ 21న విభజనపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు  తెలిపారు.యూపీ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి ప్యాకేజీ తమకు అందలేదన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి బీఎస్పీ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...