Tuesday, November 29, 2011

' అయ్యో ' ఎస్ శ్రీలక్ష్మి...!

హైదరాబాద్,నవంబర్ 29:  ఓఎంసీ కేసులో అరెస్ట్ అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం  డిసెంబర్ 12 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది.  డిసెంబర్ ఒకటవ  తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆమెను కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం సీబీఐ ని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో శ్రీలక్ష్మిని విచారించాలని సూచించింది.  జైలుకు పంపితే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు .శ్రీలక్ష్మికి  సీబీఐ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)  కి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ని ఆరోపణలతో  శ్రీలక్ష్మి ని సోమవారం సాయంత్రం సి.బి.ఐ. తన అదుపులోకి తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో ఓ మహిళా ఐఏఎస్ అరెస్టు కావడం ఇదే మొదటిసారి. ఓఎంసీ కేసులో ఆమెను నాలుగవ నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి సహకరించారని ఆరోపిస్తూ సీబీఐ ఇప్పటికే పలుమార్లు ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో నేరపూరితమైన కుట్ర, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రీలక్ష్మిని అరెస్టు చేసినట్లు సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ  వెల్లడించారు.  రాజసేఖర రెడ్డి హయాంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సయమంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆమెపై అభియోగాలున్నాయని చెప్పారు. ఓఎంసీ యజమాని గాలి జనార్ధనరెడ్డి, ఆ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్‌ను  ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేఆరు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...