Sunday, November 27, 2011

వాంఖడే లో ఉత్కంఠ భరిత ' డ్రా '

ముంబై,నవంబర్ 27: :  డ్రా గా ముగుస్తుందనుకున్న ఆఖరి టెస్టులో చివరి రోజు ఉత్కంఠ  పరిణామాలు సంభవించాయి. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. ఆపై 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్‌లో మూడు పరుగులు చేస్తే విజయం సాధించే దశలో రెండు పరుగులే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో  9 వికెట్లకు 242 పరుగులు చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా విండీస్ డ్రాతో గట్టెక్కింది. ఒకవేళ భారత్ ఆలౌటై స్కోర్లు సమమై ఉంటే ఈ మ్యాచ్ ‘టై’ గా ముగిసేది. తొలుత సెహ్వాగ్ (65 బంతుల్లో 60; ఫోర్లు 8) దూకుడైన ఆరంభాన్నివ్వగా... మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లి (114 బంతుల్లో 63, ఫోర్లు 3, సిక్స్ 1) రాణించాడు. అంతకుముందు భారత స్పిన్నర్లు ఓజా (6/47), అశ్విన్ (4/34) స్పిన్ మాయకు విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు కుప్పకూలింది. బ్రాత్‌వేట్ (115 బంతుల్లో 35; ఫోర్లు 2), బ్రావో (105 బంతుల్లో 48; ఫోర్లు 5) టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు, సెంచరీ చేసిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు, సిరీస్ అవార్డు లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...