దూరం పెరుగుతోందా...?

హైదరాబాద్: 'పంజా'  సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కలకలం సృష్టించినట్టే కనబడుతోంది.  తనకు వారసత్వంపై నమ్మకం లేదని, చిరంజీవి తమ్ముడిగా నిలబడాలని తాను అనుకోవడం లేదని, అభిమానులు చిరంజీవి తమ్ముడిగా తనను చూడవద్దని, తనను తానుగానే చూడాలని పంజా సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో  పవన్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల  తర్వాత రెండు రోజులకు    హీరో అల్లు అరవింద్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు కాదని,  తామంతా కలిసే ఉన్నామని చెప్పారు. తాను షూటింగు నుంచి ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమానికి వెళ్లలేకపోయామని, రామ్ చరణ్ తేజ్ చైనాలో షూటింగులో ఉన్నారని, చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని ఆయన చెప్పారు. గురువారంనాడు తాజాగా చిరంజీవి గొంతు విప్పారు. మీడియా వార్తలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, ఫంక్షన్‌కు హాజరు కాకపోయినంత మాత్రాన దూరమైనట్లు కాదని, తాను చాలా ఫంక్షన్లకు వెళ్లలేదని ఆయన అన్నారు. వారసత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన అభినందించారు. మొత్తం మీద, తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవి కుటుంబానికి మధ్య దూరం పెరిగినట్టు సూచిస్తున్నాయి. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు